Big News : జేపీ నడ్డాతో మై హోం గ్రూపు అధినేత భేటీ..

-

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. బీజేపీ అధిష్టానం తెలంగాణను టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా నేడు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో హీరో నితిన్‌ భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ వరంగల్ వేదికగా జరిగిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. అనంతరం సినీ హీరో నితిన్ తో భేటీ అయ్యారు.

I-T raids on at My Home Group's Hyd offices, Chairman Rameshwar Rao's  residence | The News Minute

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే మాజీ క్రికెట‌ర్ మిథాలీ రాజ్ ఆయ‌న‌తో భేటీ కాగా… ఈ రాత్రికి తాజాగా జేపీ న‌డ్డాతో భేటీ కాబోయే ప్ర‌ముఖుల జాబితాలో టీవీ9 అధినేత‌, మై హోం గ్రూపు అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు కూడా చేరారు. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో కొన‌సాగుతున్న బ‌హిరంగ స‌భ‌లో జేపీ న‌డ్డా పాల్గొన్నారు. ఈ సభ ముగిసిన త‌ర్వాత హెలికాప్ట‌ర్ ద్వారా ఆయ‌న శంషాబాద్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా నోవాటెల్‌లో కాస్తంత సేపు విశ్రాంతి తీసుకోనున్న జేపీ న‌డ్డాతో జూప‌ల్లి భేటీ కానున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news