Breaking : జేపీ నడ్డాతో హీరో నితిన్‌ భేటీ.. సర్వత్రా ఆసక్తి

-

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. బీజేపీ అధిష్టానం తెలంగాణను టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా నేడు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో హీరో నితిన్‌ భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ వరంగల్ వేదికగా జరిగిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. అనంతరం సినీ హీరో నితిన్ తో భేటీ అయ్యారు. శ‌నివారం సాయంత్రం హైదారాబాద్ లోని నోవాటెల్ హోట‌ల్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు, క్రీడాకారుల‌ను అహ్వానించిన‌ట్లు తెలుస్తోంది.

 

అంతకు ముందు జేపీ నడ్డా పర్యటనలో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌తో శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసిన జేపీ నడ్డా.. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో సంభాషణ గొప్పగా సాగిందని చెప్పారు. ప్రధాని మోదీ అందించిన వ్యక్తిగత మద్దతు, మార్గదర్శకత్వాన్ని మిథాలీ రాజ్ ప్రశంసించినట్టుగా చెప్పారు. అయితే.. రాబోయే ఎన్నికల నాటికి బీజేపీకి సపోర్ట్ గా పెద్ద ఎత్తున సినీ గ్లామర్ ను పెంచాలనే వ్యూహత్మకంగా పావులు కదుపుతోందని చర్చ మొదలైంది. నితీన్‌ కొత్త మూవీ మాచర్ల నియోజకవర్గంపై నడ్డా ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. ఇద్దరి మధ్య సినిమాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news