నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ ప్రమాణం

-

సుప్రీం కోర్టు సీజే పదవి నుంచి నిన్న ఎన్వీ రమణ.. దిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ నూతన సుప్రీం కోర్టు సీజే రానున్నారు. ఇవాళ భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్. నూతన సీజేఐగా ఆయనతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్ లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1985 డిసెంబరు వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. ఆ మరుసటి ఏడాది ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీసు షురూ చేశారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అనేక కీలక కేసుల తీర్పుల్లో జస్టిస్ లలిత్ కూడా భాగస్వామిగా ఉన్నారు. ఇక ఇవాళ… భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news