నాకు దేశమే ఫస్ట్..అన్ని పార్టీలు నావే : కమల్‌హాసన్‌

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా నేడు ఢిల్లీలోకి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రవేశించింది. అయితే.. ఈ పాదయాత్రలో ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో పాల్గొనద్దని కొంతమంది చెప్పారని తెలిపారు. యాత్రలో పాల్గొంటే రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని అన్నారన్నారు. అయితే యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని కమల్ తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగాఢిల్లీలో రాహుల్ వెంట ఆయన నడిచారు.

I'm Here As An Indian': Actor Kamal Haasan Joins Rahul Gandhi's Bharat Jodo  Yatra

‘‘ నేను భారతీయుడిని ఎక్కడికైనా వెళ్తా. నాకు దేశమే ఫస్ట్..అన్ని పార్టీలు నావే. మా నాన్న కాంగ్రెస్ వాది ’’ అని కమల్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇవాళ ఢిల్లీలోకి ప్రవేశించడంతో.. ఢిల్లీ వీధుల్లో కిక్కిరిసిపోయే జన సందోహం మధ్య ఆయన యాత్ర కొనసాగుతోంది. సోనియా, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా జోడోయాత్రలో పాల్గొన్నారు. ఇక డిసెంబర్ 16 నాటికి రాహుల్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news