నటనకే నాయకుడు కమల్ హాసన్..ఘనంగా ‘విక్రమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

-

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రం ఈ నెల 3న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు హరీశ్ శంకర్, బుచ్చి బాబు సానా,వెంకీ కుడుముల, వెంకటేశ్, నితిన్ తదితరులు వచ్చి బెస్ట్ విషెస్ చెప్పారు.

కమల్ హాసన్ నటనకే నాయకుడని బుచ్చిబాబు సానా తెలిపారు. వెంకటేశ్ మాట్లాడుతూ కమల్ హాసన్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు గ్లోబల్ స్టార్ అని తెలిపాడు. ఆయన ‘దశావతరం’ మాత్రమే కాదు వంద అవతారాలున్న సినిమా అయినా చేయగలడని వివరించాడు. ఇక కమల్ హాసన్ మాట్లాడుతూ..వచ్చిన అతిథులకు ధన్యవాదాలు తెలిపాడు.

మన సినిమాలు పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ కావాలని అన్నారు. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తెలుగు ప్రేక్షకులు ఆ మాటలు చెప్పే ధైర్యం ఇచ్చారని తెలిపాడు. తమిళ్ లో తను నటించిన సినిమాల్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయని, కానీ, తెలుగులో తాను చేసిన కొన్ని చిత్రాలైనా అన్నీ విజయం సాధించాయని గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news