వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు..న‌న్ను చంప‌డానికి చూస్తున్నారు !

-

త‌న‌ను చంప‌డానికి చూస్తున్నారని.. వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగ వ‌ర్ధంతి సంద‌ర్బంగా నిర్వ‌హించిన ఆత్మీయ స‌భ‌లో వంగవీటి రాధా మాట్లాడారు. త‌న‌ను చంపడానికి కొంత మంది రెక్కీ నిర్వహించారని… రంగా కీర్తి ,ఆశయాల సాధనే తప్ప లక్ష్యం, పదవుల పై త‌న‌కు అస్స‌లు ఆశ లేదని స్ప‌ష్టం చేశారు వంగవీటి రాధా. కానీ త‌న‌ను ఏదో చేద్దాము అనుకుని కొంత మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రెక్కీ నిర్వహించార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తాను ఎవ‌రికీ భయపడే వ్య‌క్తిని కాద‌ని… అన్ని వేళలా ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదురు కునేందుకు తాను సిద్ధమేన‌ని స్ప‌ష్టం చేశారు వంగవీటి రాధా. నన్ను పొట్టన పెట్టుకోవాలి అనుకునే వారికి నేను భయపడను, ప్రజల మధ్యే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. నన్ను లేకుండా చెయ్యలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని కోరారు వంగ‌వీటి రాధా. రెక్కీ నిర్వహించింది ఎవరో త్వరలో తెలుస్తుందని రాధా స్ప‌ష్టం చేశారు. అయితే.. తాజాగా వంగవీటి రాధా చేసిన ఈ వ్యాఖ్యలు.. ఏపీ రాష్ట్ర రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news