కవిత అరెస్ట్ ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమే – రేవంత్ రెడ్డి

-

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై స్పందించారు టిపిసిసి ఛీ రేవంత్ రెడ్డి. జగిత్యాల లో పాదయాత్ర చేపడుతున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అనుకుంటే గంటలోపే కవితను జైలుకు పంపొచ్చన్నారు. కానీ బిజెపి – బిఆర్ఎస్ ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నాయని ప్రశ్నించారు. కవిత, సంతోష్, హరీష్, కేటీఆర్ దగ్గర లక్ష కోట్ల సంపద ఉందని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

కవితను ఏమైనా పేరంటానికి పిలుస్తున్నారా? అని ప్రశ్నించారు. కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తాడన్నారు రేవంత్ రెడ్డి. బిఆర్ఎస్ ఆందోళనతో బీజేపీ కూడా రోడ్డెక్కుతుందన్నారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీయేనన్నారు. కవితను జైల్లో వేయడానికి ఇంత సేపా..? అని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాత్మక డ్రామా అడుతున్నాయని కీలక ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలను, ఆదానిపై హిండెన్బర్గ్ నివేదికను పక్కదారి పట్టించేందుకు బీజేపీ, సిసోడియా ఎపిసోడ్ ని బిఆర్ఎస్ తెరపైకి తెచ్చాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news