రేపు కవిత నిరహార దీక్ష..రంగంలోకి మమతా బెనర్జీ, వామపక్షాలు

-

రేపు కవిత నిరహార దీక్ష చేయనుంది. “భారత్ జాగృతి” ఆధ్వర్యంలో రేపు కవిత నిరాహార దీక్ష చేయనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్ తో నిరహార దీక్ష చేస్తోంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీతారామ్ యేచూరి, శివసేన నేత ఎమ్.పి ప్రియాంక చతుర్వేది రానున్నారు.

ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, త్రిణమూల్ కాంగ్రెస్ నేత సుస్మిత దేవ్, జేడి-యునైటెడ్ నేత త్యాగి హాజరుకానున్నారు. జంతర్ మంతర్ వేదికగా విపక్షాల ప్రదర్శన చేయనున్నారు. ఇక జంతర్ మంతర్ వద్ద జరగనున్న బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నిరహార దీక్షకు పలు ప్రతిపక్షాల మద్దతు తెలిపారు. దీక్ష కు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు, 29 రాష్ట్రాల నుంచి మహిళహక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతల ప్రాతినిధ్యం హాజరై, సంఘీభావం తెలుపనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news