BREKING : నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్..మోడీతో తాడో..పేడో !

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… ఇవాళ ఢిల్లీ వెళ్ళనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్… అందులో భాగంగానే ఇవాళ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఢిల్లీ టూర్ లో ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులను.. కలవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

గత నవంబర్ మాసంలోనూ… దాన్యం కొనుగోలు కోసం ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్ .. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కలవలేకపోయారు. కానీ ఈసారి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్. ఇప్పటికే ప్రధాని మోడీ అపాయింట్మెంటు కోసం సీఎంవో… ఢిల్లీ అధికారులు సంప్రదించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం… టిఆర్ఎస్ భవన్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్… కేంద్రం పై నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news