బ్రేకింగ్‌ : తెలంగాణలో కరోనా ఆంక్షలు ఎత్తేసిన కేసీఆర్‌ సర్కార్‌

-

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసినట్టుగా సమాచారం అందుతోంది. నిన్నటితో తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు గడువు ముగిసిపోయింది. ఇలాంటి తరుణంగా… మళ్ళీ కేసీఆర్‌ సర్కార్.. ఆంక్షలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు. బహిరంగ సభలు, ర్యాలీల పై నిషేధిస్తూ రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాల్లో మాస్ గ్యాదరింగ్‌ కు అనుమతి లేదంటూ జనవరి ఒకటి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

బహిరంగ ప్రదేశాల్లో, మాల్స్,  షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో మాస్క్ ను తప్పని సరి అంటూ అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్. ఇక జనవరి 31 వ తేదీతో ఆ ఆంక్షల గడువు పూర్తి అయి పోయింది. ఇక ఇవాళ ఫిబ్రవరి 1 వ తేదీ. అయినప్పటికీ.. ప్రభుత్వం ఉత్తర్వులు పొడగించలేదు. దీంతో ఆంక్షలు లేనట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజు కు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news