కేసీఆర్‌ మనవడు హిమాన్షు కాలికి తీవ్ర గాయం.. హాస్పిటల్ లో చేరిక?

-

సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు కాలికి ఫ్యాక్చర్‌ అయినట్టు తెలుస్తోంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న హిమాన్షు బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరినట్టు చేబుతున్నారు. కనీసం నిలబడలేక పోతున్న హిమాన్షుకు వైద్యులు సీటీ స్కాన్‌ చేయగా
తుంటి, మోకాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు తేలింది. ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో హిమాన్షు గాయపడినట్లు సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.

హార్స్‌ రైడింగ్‌ చేస్తుండగా కిందపడి గాయాలపాలైనట్లు మరొక ప్రచారం జరుగుతోంది. దీంతో హిమాన్షు కాలికి డాక్టర్లు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కేటీఆర్ దంపతులు హాస్పిటల్ లోనే కొడుకుతో పాటే ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూడా మనవడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు యశోద డాక్టర్లతో ఫోన్ లో మాట్లాడినట్టు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు మినహా ఇతర కార్యక్రమాల్లో తాతతో పాటే సందడి చేస్తుంటాడు హిమాన్షు.

Read more RELATED
Recommended to you

Latest news