కెసిఆర్ కు తెలంగాణతో బంధం తెగిపోయింది – ఈటల రాజేందర్

-

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన నేపథ్యంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ ఏర్పాటుతో కేసిఆర్ కు తెలంగాణతో బంధం తెగిపోయిందన్నారు. నల్గొండ జిల్లాలో ప్రజాగోస – బిజెపి భరోసా బైక్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా కెసిఆర్ కు లేదుగానీ.. దేశాన్ని బాగు చేస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు.

దేశాన్ని సురక్షితంగా, సుభిక్షంగా పరిపాలించే సత్తా బిజెపికి మాత్రమే ఉందన్నారు. టిఆర్ఎస్ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి కూడబలుక్కొని మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ని లేవనెత్తుతున్నారని.. ఆ సెంటిమెంట్తో మళ్ళీ తెలంగాణ ప్రజలని కేసీఆర్ మోసం చేయలేరని అన్నారు. 2018 ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్.. ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news