బిడ్డని లిక్కర్ కేసు నుండి కాపాడడానికే కెసిఆర్ ఈ కుట్రలు చేస్తున్నారు – బండి సంజయ్

-

సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కూతురిని లిక్కర్ కేసు నుండి తప్పించడానికి కెసిఆర్ ఈ కుట్రకు తెరలేపారు అని ఆరోపించారు. నిన్న కేసీఆర్ చూపించిన వీడియోలో అస్సలు ఏమీ లేదని అన్నారు. ఇక రోజు ప్రెస్ మీట్ పెడతానన్న కెసిఆర్ ఈరోజు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కెసిఆర్ ని చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కూతురిని లిక్కర్ కేసు నుండి తప్పించడానికి ఢిల్లీలో పది రోజుల పాటు ఈ కుట్ర కి ప్లాన్ చేశారని ఆరోపించారు. ఫామ్ హౌస్ లో దొరికిన డబ్బులు ఇంతవరకు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో పక్కా ప్లాన్ ప్రకారమే ఫామ్ హౌస్ ఘటనకి తెరలేపారని అన్నారు. ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలోనే దొంగ పాస్పోర్టులు తయారు చేసిన ఘనుడు కెసిఆర్ అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news