పరేడ్ గ్రౌండ్స్ లో తెరాస భారీ సభ..

-

తెరాస అధినేత కేసీఆర్ నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.. నేటి సభ ద్వారా తెలంగాణలో తమ సత్తాను చాటనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 29 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హజరై  ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ సభకు హాజరై కార్యకర్తలకు గెలుపే ధ్వేయంగా దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సభకు భారీగా జనసమీకరణ చేయాలని గ్రేటర్ టీఆర్ఎస్ నాయకులు నిర్ణయించారు. ఇప్పటికే  మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతిపక్షాల వైఖరిని ఎండ గట్టడంతో పాటు, తెలంగాణలో తెరాస చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి నేటి సభలో కేసీఆర్ వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news