కులం చూసి కేసీఆర్ మ‌ర్యాద ఇస్తారంట‌.. ఈట‌ల రాజేంద‌ర్‌ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

-

కేసీఆర్ ఏ ప‌నిచేసినా దాంట్లో ఉన్న మ‌ర్మాన్ని క‌నిపెట్టి మ‌రీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. ఇప్ప‌టికే ఆయ‌న ఫామ్ హౌస్ దాటి రావ‌డం వెన‌క ఉన్న విష‌యాన్ని చెప్పి కేసీఆర్‌పై వ్య‌తిరేక తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఈట‌ల రాజేంద‌ర్‌ Etela Rajender . అయితే మ‌రోసారి ఈట‌ల రాజేంద‌ర్ కేసీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాదు స‌మాధానం చెప్ప‌లేని ప్ర‌శ్న‌ల‌ను సంధించారు.

ఈట‌ల రాజేంద‌ర్‌/ Etela Rajender
ఈట‌ల రాజేంద‌ర్‌/ Etela Rajender

రీసెంట్‌గా కేసీఆర్ ద‌ళితుల కోసం ప్ర‌త్యేక ప్యాకేజీని ప్ర‌క‌టిస్తూ త్వ‌ర‌లోనే వారికి కార్పొరేష‌న్ల ద్వారా మ‌రిన్ని అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని వివ‌రించారు. కాగా ఈ వ్వ‌వ‌హారంపై ఈట‌ల రాజేంద‌ర్ స్పందించారు. ఆయ‌న ఈరోజు హుజూరాబాద్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు అస‌లు ద‌ళితులంటేనే మ‌ర్యాద లేద‌ని వారిని ఎన్న‌డూ గౌర‌వించ‌లేద‌ని చెప్పారు.

అంతే కాదు కేసీఆర్ మ‌నిషి కులాన్ని చూసే మ‌ర్యాద ఇచ్చే నాయ‌కుడ‌ని, అలాంటి వ్య‌క్తికి అస‌లు చిన్న కులం వారంటే అస‌హ్యం అని సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు. దాంతో పాటే కేసీఆర్ స‌మాధానం చెప్ప‌లేని ఓ ప్ర‌శ్న‌ను విసిరారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోని సీఎంవో ఆఫీసులో ఒక్కరైనా ద‌ళిత లేదా గిరిజ‌న ఐఏఎస్ ఆఫీస‌ర్ ఉన్నారా అని ప్ర‌శ్నించారు ఈట‌ల‌. కాగా ఈ స‌మాధానం చెప్ప‌డం కేసీఆర్‌కు క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే సీఎంవో ఆఫీసులో ఉన్న‌వారంతా అగ్ర కులానికి చెందిన‌వారే.

Read more RELATED
Recommended to you

Latest news