మోడీ, యోగి పై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థరహితం : రాజ్ నాథ్ సింగ్

-

భారత ప్రధాని మోడీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను పదవీ నుంచి తొలగిస్తారని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. జూన్ 01 తరువాత మళ్లీ జైలుకు వెళ్లాల్సిన వ్యక్తి మోడీ గురించి అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 2029లోనూ ఆయనే ప్రధాని కావాలని దేశం కోరుకుంటోందని చెప్పారు. యోగి పై కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.

ఇక ఇండియా కూటమి పై విమర్శలు చేశారు. సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.. కానీ అది కావడం అసాధ్యం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మరోసారి ప్రధానిగా మోడీని గెలిపిస్తే.. దేశం మరింత అభివృద్ధి  సాధిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version