ఒక్కనిమిషంలో రాజీనామా.. కేశినేని సంచలన వ్యాఖ్యలు

-

విజయవాడ తెలుగుదేశం పార్టీలో పుట్టిన ముసలం సంచలనం రేపుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని పై టీడీపీ నేతలు విమర్శలు చేశారన్న సంగతి తెలిసిందే. అయితే తన మీద చేసిన విమర్శలపై నాని వివరణ ఇచ్చారు.  ” నాకు పార్టీలో ఎవరితో విభేదాలు లేవని అన్నారు. నాపై నేతల వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్న ఆయన నేను ఎవరికీ ఫిర్యాదు చేయను  అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. ఇక విజయవాడలో టీడీపీని గెలిపించడం పైనే నా ద్రుష్టి అంతా ఉందని అన్నారు.

ఒక వేళ చంద్రబాబు ఆదేశిస్తే ఒక్క నిమిషంలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అలాగే బీజేపీ, వైసీపీ ఎంపీలను లంచ్ కు పిలిస్తే తప్పేంటి ? అని ప్రశ్నించిన ఆయన అది పార్లమెంట్ సంప్రదాయం. పార్లమెంట్ సెంట్రల్ హాల్ గురించి ఇక్కడి నేతలకు తెలియదని అన్నారు. ఇక చంద్రబాబు రూట్ మ్యాప్ ను నేను మార్చలేదని, అది పార్టీ నిర్ణయం అని అన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news