Khushi: విజయ్,సమంత నటించిన అప్పుడే అన్ని కోట్లు లాభమా..?

-

టాలీవుడ్లో యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండకు సపరేట్ క్రేజీ ఉందని చెప్పవచ్చు. తాజాగా సమంత విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్ పై తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కచ్చితంగా విజయం సాధిస్తుందని విజయ్ అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సమంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడంతో ఖుషి సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది వాటి గురించి చూద్దాం.

ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వకముందే ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకే అమ్ముడుపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆడియో సంస్థలలో ఒకటైన సరిగమ సంస్థ ఈ చిత్రం ఆడియో హక్కులను కొనుగోలు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి అందుకోసం రూ.13 కోట్ల రూపాయలు అమ్ముడుపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళం లో మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన అబ్దుల్ వహీదా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఖుషి సినిమా పాటలు విడుదలవ్వకుండా అని ఈ సినిమా ఆడియో రైట్స్ ఊహించని రేటుకు పలకడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ చిత్రంలో సమంత నటిస్తున్నందుకుగాను రూ.4 కోట్ల రూపాయలను అందుకుంటున్నట్లు సమాచారం. ఖుషి సినిమా సమంత రేంజ్ను విజయ్ దేవరకొండ రేంజ్ ను మార్చే అవకాశం ఉంటుందని అభిమానుల సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సమంత నటించిన యశోద చిత్రం ఈనెల 11వ తేదీన విడుదల కాబోతోంది. ఇక విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత ఈ చిత్రంలోనే నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news