‘షేర్షా’ పాటకు డ్యాన్స్ చేస్తూ కల్యాణ మండపానికి కియారా.. వీడియో వైరల్

-

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా – కియారా అడ్వాణీ ఈ నెల 7న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కియారా-సిధ్‌ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో కియారా.. ‘షేర్షా’ చిత్రంలోని రాంఝా పాటకు డ్యాన్స్‌ చేస్తూ వివాహ వేదికపైకి చేరుకుంది. అనంతరం కియారా-సిద్ధార్థ్‌ దండలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు పెళ్లితో ఒక్కటైన నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

షేర్షా సినిమాతో ఆన్‌స్క్రీన్‌ హిట్‌ పెయిర్‌గా నిలిచిన సిద్ధార్థ్‌, కియారా కొంతకాలానికి ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news