భార్య కోసం కొడుకుని కిడ్నాప్ చేసాడు…!

-

మహారాష్ట్రలోని పూణేలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. తన ఇంటికి తన భార్య తిరిగి రావాలని భార్యపై ఒత్తిడి తెచ్చేందుకు సోలాపూర్ లో నివాసం ఉండే ఒక వ్యక్తి మూడేళ్ళ బాలుడుని తన ఫ్రెండ్ తో కలిసి కిడ్నాప్ చేసాడు. అతని భార్య పుట్టింటిలో నివాసం ఉంటుంది. ఎంత అడిగినా భార్య తిరిగి ఇంటికి రావడం లేదని అసహనానికి లోనైన అతను స్నేహితుడి సహాయంతో కొడుకుని కిడ్నాప్ చేసాడు.

30 ఏళ్ల వ్యక్తిని ఈ ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేసారు. తన మనవడిని ఎవరో కిడ్నాప్ చేశారని మహిళ తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన ఫిర్యాదులో మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తిని తన ఇంటి సమీపంలో గుర్తించా అని చెప్పడంతో క్రైం బ్రాంచ్ వ్యక్తిని గుర్తించింది. విచారణలో అతను నేరం ఒప్పుకోవడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి 3 సంవత్సరాల చిన్నారిని తన తల్లికి అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news