మాట తప్పని మడమ తిప్పని గొప్ప మన్యం వీరుడు అల్లూరి : కిషన్‌ రెడ్డి

-

చరిత్ర స్మరించుకోదగ్గ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముంగిపు సభలను హైద్రాబాద్ లో నిర్వహించారు. ఈ సభలో షన్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లూరి ఓ వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదని సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన చరిత్ర విస్మరించలేరని అన్నారు. మాట తప్పని మడమ తిప్పని గొప్ప మన్యం వీరుడు అల్లూరి అని అన్నారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ.. గిరిజనుల స్వాతంత్ర్యం, సంస్కృతిని కాపాడేందుకు అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారన్నారు.

G Kishan Reddy replaces Bandi Sanjay as Telangana BJP president | News9live

తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఆయన స్మరించుకున్నారు. గొప్ప వ్యక్తుల స్మరణతోనే చరిత్రకు గుర్తింపు వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. . అల్లూరి జయంతి ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రారంభించారన్నారు. అల్లూరి జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట్రపతి హాజరు కావడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news