ముద్దు కావాలన్నాడు.. చివరికి ఏడు నెలల జైలు శిక్ష..?

-

ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై హత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా కామందులు ఆడ పిల్లలపై లైంగిక వేధింపులకు దిగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సింగపూర్లో రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేందుకు నిర్ణయించింది.

ఈ క్రమంలోనే ఓ బాలికను ముద్దు పెట్టుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఏకంగా ఏడు నెలల జైలు శిక్ష విధించింది అక్కడి కోర్టు. సింగపూర్ లో ఉండే భారత సంతతికి చెందిన వ్యక్తికి ఇటీవలే ఓ బాలిక తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లు. ఇక ఇటీవల ఓ బాలిక తన స్నేహితుల కోసం మద్యం తీసుకురావాలని యువకున్ని కోరడంతో యువకుడు మద్యం తీసుకెళ్లి అందించే క్రమంలో బాలికను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు దీంతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో కోర్టు అతనికి ఏడు నెలల జైలు శిక్ష విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news