IPL 2021 : ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్.. రేపే ఐపీఎల్ ఫైనల్

-

నిన్న జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో… ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కోల్కతా నైట్రైడర్స్ చిత్తు చేసింది. దీంతో నేరుగా ఫైనల్ బరిలోకి ఎంటర్ అయింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. ఒక ఫైనల్ లో రేపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది కేకేఆర్. బుధవారం జరిగిన నా రెండో క్వాలిఫైయర్ లో… కేకేఆర్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఢిల్లీ పై గెలిచింది. టాస్ ఓడిన ఢిల్లీ జట్టు…మొదట బ్యాటింగ్ చేసి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్ ధావన్ 36 పరుగులు మరియు శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన పరుగులు అందించారు.

ఢిల్లీ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ లో ఎవరూ రాణించక పోవడంతో… కేకేఆర్ జట్టు ముందు స్వల్ప లక్ష్యాన్ని పంచ గలిగింది. ఇక 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు… ఆది నుంచి ఆచితూచి… ఆడింది.

చివర్లో కాస్త తడబడ్డా ఓ బంతిని మిగిలివుండగానే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై విజయం సాధించింది కేకేఆర్ జట్టు. ఓపెనర్ శుభ మన్ గిల్ 46 పరుగులు మరియు వెంకటేష్ అయ్యర్ 55 పరుగులు చేసి… కేకేఆర్ విజయానికి కష్టపడ్డారు. చివర్లో వరుసగా ఐదు వికెట్లు పడినప్పటికీ…19.5 ఓవర్లో ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది కేకేఆర్ జట్టు. దీంతో ఫైనల్ కి ఎంట్రీ ఇచ్చింది కేకేఆర్. ఇక రేపు రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది కేకేఆర్

Read more RELATED
Recommended to you

Latest news