తెలంగాణ మంత్రులకు కొడాలి నాని కౌంటర్.. వైఎస్ రాక్షసుడు కాదు రక్షకుడు

-

తెలంగాణ మంత్రులు వైఎస్ పై చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. కొంత మంది రాజశేఖర్ రెడ్డిని రాక్షసుడు అంటున్నారని.. రాజశేఖర్ రెడ్డిని రాక్షసుడు కాదు రక్షకుడని తెలంగాణ మంత్రులు చురకలు అంటించారు. ఈ రాష్ట్రం ముక్కలు అవ్వకుండా కాపాడిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. వైఎస్ మరణంతో ఈ రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిగా మారిందని పేర్కొన్నారు. తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని ప్రతి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ వెనుక అడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కొడాలి నాని.

పార్టీలో ఎవరు చేరాలనుకున్నా అన్ కండీషనల్ గా రావాల్సిందేనని.. కనకదుర్గమ్మ , శ్రీశైలం గుళ్ళల్లో క్షుద్రపూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని చురకలు అంటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనే మహా వృక్షంలో చిన్న చిగురు జగన్ అని.. ఆ చిగురు ఇవాళ మహా వృక్షమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు, ఆయన తాబేదారులు, కొన్ని మీడియా సంస్థలు విషం కక్కుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news