ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

-

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నేడు ఖమ్మం జిల్లాలో ప్రారంభించారు సీఎం కేసీఆర్. యాదాద్రి నుంచి ఖమ్మం చేరుకున్నారు సీఎం కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరై విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, పలువురు జాతీయ నేతలు.

ఈ సందర్భంగా ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఈ పథకం గురించి జాతీయ నాయకులకు వివరించారు. అనంతరం ఖమ్మం నూతన కలెక్టరేట్ ను కూడా కేసీఆర్ ప్రారంభించారు. మరి కాసేపట్లో ఖమ్మం టిఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లనున్నారు నేతలు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామ, మున్సిపల్ వార్డులో కంటి పరీక్షల క్యాంపులు సర్కారు ఏర్పాటు చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news