కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి – సిపిఎం మాజీ ఎంపీ మధు

-

కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు సిపిఎం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు మధు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 14 నుంచి 27 వరకు ఆంధ్రప్రదేశ్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ కి వ్యతిరేకంగా బిజెపి కుయుక్తులు చేస్తోందని ఆరోపించారు. అమరావతి రాజధానినీ నిర్వీర్యం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో బిజెపి పాత్ర కూడా అంతే ఉందన్నారు.

అమరావతి రైతులను జగన్మోహన్ రెడ్డి బలి చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రైతులను పిలిచి రాజధాని వివాదాలకు ముగింపు పలకాలని అన్నారు. అమరావతి రాజధాని సమస్యకి కారణమైన బిజెపిని పాదయాత్ర సభకు పిలవడం సరికాదన్నారు మధు. అమరావతి రైతుల పాదయాత్రను వైసీపీ నాయకులు అడ్డుకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news