చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. టిడిపి ఆవిర్భావం సందర్భంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటే.. చంద్రబాబు మాత్రం లోకేష్ పదవి పోయిందని ఏడుస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని వ్యాపార సంస్థగా మార్చుకొని కోట్లాది రూపాయలు సంపాదించారని, ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు. గతంలో 23 మందిని వైసీపీ నుంచి చేర్చుకుంటే 2019లో 23 సీట్లు వచ్చాయని.. ఇప్పుడు నలుగురిని చేర్చుకున్నారని, ఇక వచ్చే ఎన్నికలలో టిడిపికి ఆ నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు.

మొన్నటి ఎన్నికలలో ఒక ఎమ్మెల్సీ గెలిచిందంటే అది జగన్ వదిలేసిన ఎంగిలి కూడు తోనే సాధ్యమైందని అన్నారు. వాళ్ళిద్దరికీ వచ్చే ఎన్నికలలో సీట్లు ఇవ్వబోమని జగన్ తేల్చి చెప్పారని.. అందుకే టిడిపికి అమ్ముడుపోయారని అన్నారు. చంద్రబాబు అంటే వెన్నుపోటు గుర్తుకు వస్తుందని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అవసరమైతేనే ఎన్టీఆర్ ను దేవుడు అంటారని.. లేకపోతే రాక్షసుడు అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news