FLASH : ఎమ్మెల్యే కోటంరెడ్డికి కరోనా.. వైసీపీలో టెన్షన్..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా.. ఈ మహమ్మారి బారిన నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పడ్డారు.

ఆయనకి కరోనా సోకడంతో అపోలో ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీంతో నియోజవర్గంలోని వైసీపీ నేతల్లో, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. దీంతో వారిని కూడా టెస్టులు చేయించుకోవాలసిందిగా ఆయన కోరారు. కాగా, తాజాగా కాకినాడ ఎంపీ వంగ గీత కూడా కరోనా బారిన పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news