ఆ హీరోతో డేటింగ్… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన కృతి

-

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌తో తాను డేట్‌కు వెళ్లలేదని నటి కృతి సనన్‌ అన్నారు. టైగర్‌తో కలిసి ఆమె నటిస్తోన్న చిత్రం ‘గణ్‌పత్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ జోడీ తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొంది. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. గతంలో మాదిరిగానే టైగర్‌ – కృతిలనూ ప్రైవేటు విషయాల గురించి కరణ్‌ అడిగినట్లు ఈ వీడియోలో చూడొచ్చు.

కృతి సనన్
కృతి సనన్

‘‘కృతి.. మీరు ఎప్పుడైనా ఆడిషన్స్‌లో పాల్గొన్నారా? ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్‌ చేశారా?’’ అని అడగ్గా.. ‘‘ఇక్కడ మీకో ఆసక్తికర విషయం చెప్పాలి. నేను మొదట ఆడిషన్‌కు వెళ్లిన సినిమా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -1’. ఆ చిత్రానికి మీరే దర్శకత్వం వహించారు. ఆ అవకాశం నాకు రాలేదు’’ అని కృతి బదులిచ్చారు. ‘‘టైగర్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. మీ విషయంలో టైగర్‌ అస్సలు చొరవ తీసుకోవడం లేదని మీరెప్పుడైనా బాధపడ్డారా?’’ అని కరణ్‌ ప్రశ్నించగా.. మధ్యలో టైగర్‌ అందుకుని.. ‘ఆమే చొరవ తీసుకుంది’ అని నవ్వుతూ బదులిచ్చాడు. దానిపై కృతిసనన్‌ స్పందిస్తూ.. ‘‘నేను అతడితో అస్సలు డేట్‌కి వెళ్లలేదు’’ అని వెల్లడించారు.

ప్రస్తుతం కృతి సనన్… సైఫ్​ అలీఖాన్​-ప్రభాస్​ లతో కలిసి దర్శకుడు ఓంరౌత్​ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’​లో నటిస్తున్నారు. డార్లింగ్​ రాముడిగా కనిపించనుండగా, సైఫ్​ రావణాసుడిగా నటిస్తున్నారు. కృతిసనన్​ సీత పాత్ర పోషిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news