బిగ్ బ్రేకింగ్: ఇండియా క్రికెట్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్.. టీ20 వాయిదా

-

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా బారిన పడి చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, మరియు ఇతర సినీ ప్రముఖులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అటు ఈ కరోనా మహమ్మారి క్రీడా రంగాన్ని కూడా వదలడం లేదు. ఇప్పటికే కరోనా కారణంగా మెగా టోర్నీ ఐపీఎల్ వాయిదా పడగా.. తాజాగా శ్రీలంక మరియు ఇండియా సిరీస్ పై… దీని ప్రభావం పడింది.

ఇవాళ సాయంత్రం 8 గంటలకు ప్రారంభం అవుతుంది అనగా… టీమిండియా స్టార్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇవాళ జరిగే టి20 మ్యాచ్ ను రేపటికి వాయిదా వేశారు. అంతేకాదు.. రెండు జట్ల ప్లేయర్లలో అందరికీ కరోనా నెగిటివ్ వస్తేనే బుధవారం రోజున మ్యాచ్ తిరిగి ప్రారంభిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఇక కృణాల్ పాండ్యా కు కరోనా సోకడంతో ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news