అలా మాట్లాడే వాళ్లను మన దగ్గరా అలాగే చేయాలేమో?: కేటీఆర్‌

-

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్‌ చేసిన వారిని అరెస్ట్‌ చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

పరుష పదాలతో ట్వీట్‌ చేసినందుకు బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో కన్నడ నటుడు చేతన్‌ను అరెస్ట్‌ చేసిన విషయాన్ని కేటీఆర్‌ తన ట్విటర్‌లో ప్రస్తావించారు. తెలంగాణలోనూ అదే తరహాలో సమాధానం ఇవ్వాలేమోనని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు? అంటూ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్‌ ప్రశ్నించారు. భావన ప్రకటనా స్వేచ్ఛ.. దూషించే స్వేచ్ఛ కాకూడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో కేటీఆర్ చెప్పేందే కరెక్ట్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల భాష ఈ మధ్య పరిధి దాటుతోందని దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అంటున్నారు. మరికొందరేమో కేవలం ప్రతిపక్షాలే కాదు.. అధికార పక్షాలు కూడా అలాగే మాట్లాడుతున్నాయని ట్వీట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news