త్వరలోనే వారందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు : మంత్రి కేటీఆర్‌

-

త్వరలోనే అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధి దారులకు పత్రాలు అందజేశారు మంత్రి కేటీఆర్. అనంతరం వారితో కలిసి.. పంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్‌.  అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ…. అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దేశానికి ఆదర్శమని చెప్పారు.


తెలంగాణ రాష్ట్రంలో రూ. 18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని గుర్తు చేశారు. అతి త్వరలో అందరికీ ఇండ్లు అందజేస్తామని ప్రకటన చేశారు. ఒక్క పైసా తీసుకోకుండా ప్రజలకు ఇండ్లు అందిస్తున్నామని వెల్లడించారు. అర్హులైన వారందరికీ ఎందుకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి కేటీఆర్‌.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ 8,500 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news