బండి సంజయ్‌ కు మంత్రి కేటీఆర్‌ లేఖ..సిగ్గూ, ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా..?

-

బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర పైన మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర… జుటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని.. పచ్చ బడుతున్న పాలమూరుపై కచ్చ కట్టిన మీకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదని నిప్పులు చెరిగారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడుతూ.. పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా..? అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తూ.. పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా..? అని నిలదీశారు.
పాలమూరు ఎత్తి పోతల పథకానికి జాతీయ హూదా ఎందుకు ఇవ్వలేదు? అని నిప్పులు చెరిగారు. కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నరో … సమాధానం చెప్పాలి? అని డిమాండ్‌ చేశారు.

అడుగడుగునా అన్యాయం…తెలంగాణ పుట్టకముందే కత్తిగట్టిన పార్టీ బీజేపీ అని… విభజన హామీలు నెరవేర్చే తెలివిలేదు, నీతి ఆయోగ్ చెప్పినా నిదులిచ్చే నీతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు జాతీయ హూదా ఇవ్వరని.. ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్ల పెట్టమని బ్లాక్ మెయిల్ చేస్తారన్నారు. పండించిన పంటలు కొనకుండా రైతను గోస పుచ్చుకుంటారని.. సందు దొరికితే చాలు తెలంగాణ మీద విషం గక్కుతారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news