TRS లీడర్లు…తాలిబన్లు..అచ్చం అలాగే ప్రవర్తిస్తున్నారు – వైఎస్ షర్మిల

-

సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులపై వైఎస్‌ షర్మిల నిప్పులు చెరిగారు. TRS లీడర్లు…తాలిబన్లు..అచ్చం అలాగే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులు కాళ్ళవెళ్ళా పడినా పోడు భూములు గుంజుకుంటున్నరు. తాలిబన్లు ఎలా ప్రవర్తిస్తారో నేడు TRS లీడర్లు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని విమర్శించారు షర్మిల.

పోడు పట్టాలియ్యమంటే జుట్టు పట్టుకుని జైలులో పెడ్తవా? దున్నుకోడానికి భూమి అడిగినా అరెస్టు చేస్తవా? పోడు పట్టాలు ఇవ్వడానికి కుర్చీ దొరకలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పోడు రైతులపై ఐదు వేల కేసులు అని.. చంటి పిల్లల తల్లులను జైలులో పెట్టిన ఘనత కేసీఆర్ దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? అని ప్రశ్నించారు.

సంబంధాలు బాగున్నప్పుడు బీజేపీతో డ్యూయెట్లు అని.. సంబంధాలు చెడితే ధర్నాల పేరుతో డ్రామాలు అని నిప్పులు చెరిగారు. నిరుద్యోగులు రైలు కిందపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నా KCRకు సోయిరాదని.. లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే.. 80వేలంటూ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసినవ్. పథకాలకు మాత్రం పైసల్లేవా? అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news