కేటీఆర్ “విత్ డ్రావెల్ సిస్టమ్స్” తో బాధపడుతున్నారు – బండి సంజయ్

-

కేటీఆర్ కు విత్ డ్రావల్ సిమ్టమ్స్ అనే వ్యాధి వచ్చిందని.. అందుకే పిచ్చిపచ్చిగా వాగుతున్నడని మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. ఆ తరువాత నా తల నరకినా, చెప్పుతో కొట్టినా ప్రజల కోసం భరించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అవినీతిపరుల భరతం పడతాం… తిన్న సొమ్మంతా కక్కిస్తామని అన్నారు. తాను డ్రగ్స్ పై సవాల్ చేసినప్పుడు స్పందించకుండా.. ఇప్పుడా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫారిన్ లో ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. డ్రగ్స్ కేసు దర్యాప్తు ఏమైంది అని ప్రశ్నించారు. దమ్ముంటే సిట్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చెల్లి కవిత అరవింద్ ని చెప్పుతో కొడతానని అందని, తండ్రి నన్ను ఆరు వక్కలు చేస్తానన్నాడని, ఇప్పుడు కేటీఆర్ చెప్పుతో కొడతాను అంటున్నాడని.. కుటుంబం మొత్తానికి డబ్బులు ఎక్కువ ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news