కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు – బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కెసిఆర్ కుటుంబం డ్రగ్స్, దొంగ సారా లో పెట్టుబడులు పెట్టిందని.. మంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని కీలక ఆరోపణలు చేశారు. కెసిఆర్ కుటుంబం పంచభూతాలను సైతం వ్యాపారంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు.

నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లో నిర్వహించిన ప్రజాగోష – బిజెపి భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మాట్లాడిన ఆయన.. కెసిఆర్ అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 24 గంటల విద్యుత్ పై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు బండి సంజయ్. అలా 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని.. ఒకవేళ నిరూపించలేక పోతే కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకుంటారా? అంటూ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news