LIC లో అదిరిపోయే ప్లాన్..రూ.50లక్షలు పొందే అవకాశం..పూర్తి వివరాలు..

-

ప్రభుత్వ భీమా కంపెనీ ఎల్ఐసీ తన కస్టమర్లకు కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది..అందులో కొన్ని పాలసీలు బాగా ఫెమస్ అయ్యాయి. ఇందుకు కారణం ఆ పాలసీలకు వచ్చే రిటర్న్స్ అధికంగా ఉండటమే. అలాంటి పాలసీల్లో ఎల్ఐసీ బీమా రత్న ఒకటి. ఈ పాలసీలో మెచ్యూరిటీ నాటికి రూ.50 లక్షల రిటర్న్స్ పొందొచ్చు. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. ఎల్ఐసీ బీమా రత్న ప్లాన్ తీసుకున్నవారికి సేవింగ్స్‌పై మంచి రిటర్న్స్ రావడంతో పాటు బీమా రక్షణ ఉంటుంది.

 

పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రీమియం చెల్లిస్తున్న కాలంలో ప్రమాదవ శాత్తు అతను మరణిస్తే వారి కుటుంబానికిఆర్థికంగా అండగా నిలుస్తుంది ఈ పాలసీ. ఏ సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకున్నా, మెచ్యూరిటీ సమయానికి 10 రెట్ల రిటర్న్స్ ను పొందవచ్చు..బీమా రత్న పాలసీని 2022 మేలో ప్రకటించింది కంపెనీ. కనీసం రూ.5,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. పాలసీ టర్మ్ 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లుగా ఉంటుంది. 25 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే 21 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అలాగే 20 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే 16 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ఇక 15 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే 11 ఏళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. అంటే ఎంచుకున్న టర్మ్ నుంచి 4 ఏళ్లు తీసేసి మిగితా ప్రీమీయం చెల్లిస్తే సరిపోతుంది..

ఇకపోతే బీమా రత్న పాలసీని కనీసం 90 రోజుల వయస్సు ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. వారికి 20 ఏళ్లు లేదా 20 ఏళ్ల టర్మ్ వర్తిస్తుంది. 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకోవాలనుకుంటే కనీస వయస్సు 5 ఏళ్లు ఉండాలి. కనీస మెచ్యూరిటీ వయస్సు 20 ఏళ్లు. బెనిఫిట్స్ విషయానికి వస్తే 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకున్నవారికి 13, 14వ ఏడాదిలో 25 శాతం చొప్పున రిటర్న్స్ వస్తాయి. ఇలాగే 20 ఏళ్ల టర్మ్ ఎంచుకున్న పాలసీకి 18, 19వ ఏడాదిలో 25 శాతం చొప్పున మనీబ్యాక్ వస్తుంది. ఇందులో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి..

ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల టర్మ్‌తో రూ.5,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఎల్ఐసీ బీమారత్న పాలసీ తీసుకున్నాడనుకుందాం. అతనికి 13వ సంవత్సరంలో ఒకసారి, 14వ సంవత్సరంలో రెండోసారి 25 శాతం చొప్పున మనీబ్యాక్ వస్తుంది. దీంతో పాటు మొదటి ఐదేళ్లకు రూ.1,000 కి రూ.50 చొప్పున, 6 నుంచి 10 ఏళ్ల వరకు రూ.1,000 కి రూ.55 చొప్పున, ఆ తర్వాత మెచ్యూరిటీ వరకు వరకు రూ.1,000 కి రూ.60 చొప్పున బోనస్ వస్తుంది.. ఇవన్నీ కలిపి మెచ్యూరిటీ సమయానికి రూ.50 లక్షలను పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news