ఆయన చిల్లిగవ్వ లేదంటున్నాడు.. ఈయన చండ్రుడినే ఇస్తా అంటున్నాడు.. కేటీఆర్.

-

జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.ఒకరినొకరు మాటల ద్వారా అటాక్ చేసుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ ఎస్ ల మధ్య ఈ మాటల ప్రవాహం ఎక్కువగా ఉంది. పాతబస్తీలో మీద సర్జికల్ స్టైక్ నిర్వహించి రోహింగ్యాలని తరిమికొడతాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్లు చేసినప్పటి నుండి టీఆర్ ఎస్ పార్టీ నాయకులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. తాజాగా కేటీఆర్, ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, బండిసంజయ్ పై విమర్శలు చేసాడు.

కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇవ్వలేమని చెబుతుంటే, అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం గ్రేటర్ లో కేవలం ఓట్ల కోసం చంద్రుడినే కిందకి దించుతామని అంటున్నాడని పోస్ట్ పెట్టాడు. వీటిల్లో ఏది నిజమని నమ్మమంటారని అడుగుతూ పోస్ట్ చేసాడు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. జాతీయ స్థాయిలో గ్రేటర్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మరి ఇంత ఆసక్తి కనబరుస్తున్న గ్రేటర్ ఎన్నికల్లో విజయం ఎవరికి దక్కుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news