చీమలపాడు ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని పరామర్శించిన కేటీఆర్

-

బుధవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చడంతో పక్కనే ఉన్న గుడిసెకు నిప్పపట్టుకుని దగ్ధమైంది.

మంటల వల్ల గుడిసెలోని సిలిండర్ పేలి ఒకరి మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి పలువురికి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. దీంతో బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. చీమలపాడు లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాజాగా.. హైద్రాబాద్ లో చికిత్య పొందుతున్న చీమల పాడు ఘటన బాధితులను ఈ రోజు మత్రులు కేటీఆర్ పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news