హైదరాబాద్ లో మరో దారుణం.. అడ్డా కూలీపై అత్యాచారం

-

హైదరాబాద్‌ లో మరో దారుణం చోటు చేసుకుంది. పని ఉందని చెప్పి.. ఓ అడ్డా కూలీ పై లైంగిక దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం రోజున చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… మదనపల్లి కొత్త తండాకు చెందిన ఓ మహిళ రోజువారి కూలీ. రోజులాగానే బుధవారం ఉదయం శంషాబాద్‌ లోని అడ్డా దగ్గర నిలబడింది.

గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పని ఉందంటూ ఆమెను పిలిచారు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని.. కవ్వగూడ వ్యవసాయ పొలాల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత బండరాయితో తలపై మోదీ పరారు అయ్యారు.

రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని స్థానిక రైతులు గమనించి.. 100కు సమాచారం అందించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా.. బాధితురాలి.. భర్త గత 8 ఏళ్ల కిందట మరణించాడు. దీంతో.. ఒక్కతే.. కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news