దారుణం : మీ సేవ క్యూలో నిలబడలేక వ్రుద్ద్రురాలు మృతి

-

వరద సాయం కోసం జనం బారులు తీరుతున్నారు.. హైదరాబాద్ లో భారీగా కురిసిన వర్షాలకు నష్టపోయిన వాళ్లకు ఇప్పటికే సర్కార్ నేరుగా చాలా మేరకు సహాయం అందించింది.. అయితే ఇప్పటి వరకు వరద సాయం అందని వాళ్ళంతా మీ సేవ ద్వారా ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. దీంతో మీ సేవ కేంద్రాల వద్ద జనం పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు.

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద దాదాపు కిలోమీటర్ల మేర లైన్ లో వరద బాధితులు పడిగాపులు పడుతున్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ సేవ కేంద్రం వద్ద 50 సంవత్సరాల వృద్ధురాలు మృతి చెందింది. సుమారు మూడు గంటల సేపు మీ సేవ లైన్ లో నిలబడి ఒక్కసారి కుప్పకూలిపోయిన  వృద్ధురాలిని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమెను హాస్పిటల్ కి తరలించే లోపు మృతి చెందినట్లు సమాచారం. తమ వద్దకు వచ్చే లోపే వృద్ధురాలు మృతి చెందిందని డాక్టర్స్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news