హైదరాబాద్ శివార్లలో మహిళ దారుణ హత్య

-

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మండలంలో మహిళ దారుణ హత్య గురయింది. మొయినాబాద్ మండలంలోని హిమాయత్ నగర్ గ్రామ సమీపంలోని వెంచర్ లో దారుణ హత్యకు గురైంది. హత్యకు గురైన మహిళను అతికిరతకంగా  రాయితో కొట్టి చంపారు దుండగులు. మృతి చెందిన మహిళ పేరు ఎత్తిరి లక్ష్మీ కాగా ఆమె వయసు 28 సంవత్సరాలు.

ఆమె  భర్త పేరు వెంకటప్ప, వీళ్లు గత 15 రోజుల క్రితం ఉపాధి కోసం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జంగం నుంచి వచ్చారని చెబుతున్నారు.  ఘటనా స్థలానికి మొయినాబాద్ పోలీసులు చేరుకొని డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు.  కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు ఆమె రాత్రి సమయంలో ఆ వెంచర్ లోకి ఎందుకు వెళ్ళింది ? అసలు ఆమెను ఎవరు హత్య చేశారు అనే అంశం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news