వివాహితను లక్ష రూపాయలకి అమ్మేసిన వృద్దురాలు !

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పని ఇప్పిస్తానంటూ వివాహితను లక్ష రూపాయలకు విక్రయించింది ఓ వృద్ధురాలు. భర్తతో గొడవపడి మార్చిలో ఇద్దరు పిల్లలతో వేములవాడకు చెందిన వివాహిత ఇంటిలో నుంచి వెళ్లి పోయింది. సికింద్రాబాద్ లో పరిచయమైన వృద్ధురాలు పని ఇప్పిస్తానంటూ మహారాష్ట్ర పర్భనికి తీసుకెళ్లి మోర అనే వ్యక్తి కి లక్షకు అమ్మేసింది. మోరా… రాజరామ్ అనే వ్యక్తికి అమ్మాడు.

ఆ రాజా రామ్ ఏమో నాసిక్ లోని సమీప బంధువైన లక్ష్మణ్ జగపత్ కు అమ్మాడు. మూడో భార్యగా ఉండాలంటూ లక్ష్మణ్ జగపత్ వేధింపులకు గురి చేస్తున్నట్టు చెబుతున్నారు. పారి పోతే ఇద్దరు పిల్లలను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం. 25వ తేదీన ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చింది బాధితురాలు. బంధువుల ఫిర్యాదు మేరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బాధితురాలిని గుర్తించిన వేములవాడ పోలీసులు, నాసిక్ వెళ్లి లక్ష్మణ్ జగపత్ అరెస్ట్ చేసి .వివాహితను సిరిసిల్ల సఖి కేంద్రానికి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news