విధుల్లో చేరేందుకు వస్తున్న కార్మికులు.. కానీ..

-

విధుల్లో చేరేందుకు ఆర్టీసీ డిపోలకు చేరుకుంటున్న ఆర్టీసీ కార్మికులకు చుక్కెదురవుతోంది. కానీ.. కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ ఇప్పటికే ప్రకటించారు. దీంతో విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను డిపోల వద్ద అధికారులు అడ్డుకుంటున్నారు. విధుల్లోకి తీసుకోవాలని తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు హయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌ ఆర్టీసీ డిపోల దగ్గర భారీ భద్రత చర్యలను పోలీసులు చేపట్టారు. అలాగే విధుల కోసం వస్తున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటుండడంతో డిపోల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు కొందరు తాత్కాలిక సిబ్బందిని అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news