రాహుల్ గాంధీకు దమ్ముంటే ఇప్పుడు అశోక్ నగర్ కు రావాలి – బీజేపీ ఎంపీ

-

రాహుల్ గాంధీకు దమ్ముంటే ఇప్పుడు అశోక్ నగర్ కు రావాలంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ సిటి లైబ్రరీ కి వచ్చి అరచేతితో వైకుంఠం చూపించారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని చేతబూని రాహుల్ కొంగ జపం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రూప్ వన్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారని ఆగ్రహించారు.

laxman slams rahul gandhi

యువత చేస్తున్న డిమాండ్ ను అర్థం చేసుకోవాలని.. తెలంగాణా లో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నేతృత్వంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతోoదని తెలిపారు. రిజర్వేషన్లకు చెల్లు చీటీ చేస్తున్నారని… రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఉల్లగించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారం. దగా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అభ్యర్థుల పై లారీలు జులిపిస్తున్నారు.. తలలు పగుల కొడుతున్నారని వివరించారు. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారన్నారు. రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి… ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీ ల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news