Lic సూపర్ స్కీమ్..రోజుకు రూ.45 పెట్టుబడితో రూ.25 లక్షల రాబడి.. పూర్తి వివరాలు..

-

మన దేశంలో అతి పెద్ద భీమా కంపెనీ ఎల్ఐసి ప్రజల కోసం ఎన్నో పథకాలను అందిస్తుంది.. ఇప్పటికే ఉన్న ఎన్నో పథకాలు మంచి రాబడిని ఇస్తున్నాయి.. ఎల్ఐసీలో అన్ని వయసుల వారికి పాలసీలు అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ మీరు తక్కువ పెట్టుబడితో కూడా అధిక లాభాలు పొందవచ్చు.. తాజాగా మరో పాలసిని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ పాలసీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ పేరుతో కొత్త పాలసీ ప్రకటించింది. ఈ పాలసీలో పాలసీదారుడు రోజు రూ.45 ఆదా చేయడం ద్వారా పాలసీ మెచ్యూర్ అయ్యే సమయానికి రూ.25 లక్షలు పొందవచ్చు. అలాగే ఈ పాలసీ ద్వారా పాలసీదారుడు అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు.. పాలసీలో మీరు ప్రతి నెలా దాదాపు రూ.1358 డిపాజిట్ చేయడం ద్వారా రూ.25 లక్షలు పొందవచ్చు. రోజుకు ఇలా చూసుకుంటే రోజుకు రూ.45 చొప్పున పెట్టుబడి పెడితే, ఈ పాలసీ కింద 35 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే ఈ పథకం మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీకు రూ. 25 లక్షలు అందుతాయి.

మీరు ప్రతి ఏడాది పొదుపు చేసిన మొత్తాన్ని పరిశీలిస్తే దాదాపు రూ.16,300 ఉంటుంది. ఇలా 35 ఏళ్లు సేవ్ చేస్తే మొత్తం రూ. 5,70,500 డిపాజిట్ అవతుంది. అలాగే పాలసీ టర్మ్ ప్రకారం, బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు అవుతుంది. దానితో మెచ్యూరిటీ వ్యవధి తర్వాత, మీకు రూ. 8.60 లక్షల రివిజన్ బోనస్ మరియు రూ. 11.50 లక్షల చివరి బోనస్ వస్తుంది…ఈ పాలసీలో రెండుసార్లు బోనస్ ఇస్తారు..15 ఏళ్ల వయస్సు తప్పనిసరిగా ఉండాలి..జీవన్ ఆనంద్ పాలసీని తీసుకునే పాలసీదారుడికి ఈ పథకం కింద ఎలాంటి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉండదు. అయితే మీరు దీని ప్రయోజనాలను పరిశీలిస్తే మీకు ఇందులో నాలుగు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ ప్రయోజనం ఉన్నాయి.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news