ఏపీలో ప్రభుత్వ పథకాల కోసం ఫేక్ ఆధార్ కార్డుల లింక్..!

-

ఏపీలో ఫేక్ ఆధార్ కార్డు తయారీ ముఠా అరెస్టు కలకలం సృష్టించింది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల్లో అనర్హులకు లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక పోలీసుల తనిఖీల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఆధార్ కార్డు, పాన్‌కార్డ్ డేటా బేస్‌లలో వయస్సు మార్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆధార్ సెంటర్ నిర్వాహకుడు, అతడికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ. 5 వేలకు నకిలీ ఆధార్‌ కార్డును తయారు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఘటన కృష్ణాజిల్లా తిరువూరులో చోటు చేసుకుంది.

ఈ సందర్బంగా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఇక గుడివాడ, తిరువూరులో ఆధార్‌ కార్డును ట్యాంపరింగ్‌ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. సంక్షేమ పథకాల కోసం అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తెలిసిందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. కాగా.. తిరువూరులోని ఆధార్ కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఆధార్ కార్డు, పాన్‌కార్డ్ డేటా బేస్‌లలో వయస్సు మార్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇటీవలే ప్రభుత్వ పథకాల కోసం కొంతమంది తమ వయస్సును మార్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేవారికి కొత్త నిబంధన తీసుకొచ్చింది. కొత్త నిబంధన ప్రకారం పథకానికి దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ హిస్టరీ ప్రింట్‌ అవుట్‌ కూడా సమర్పించాలి. అనర్హులకు లబ్ధి చేకూర్చి ప్రభుత్వ ఆదాయానికి నిర్వాహకులు గండికొట్టినట్లుగా గుర్తించారు. ఆధార్ సెంటర్ నిర్వాహకుడు, అతడికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ప్రకటించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news