బాబాయ్ హత్యకు నీకు..సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తావా – నారా లోకేష్‌

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి.. టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ ఛాలెంజ్‌ విసిరారు. బాబాయ్ హత్యకు నీకు..సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తావా సవాల్‌ చేశారు నారా లోకేష్‌. వివేకా గారి హత్య తో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని 14-4-21 న కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశాను.

బాబాయ్ హత్య తో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి సిద్ధమా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు నారా లోకేష్‌. తిరుమల వెళ్తున్న మీరు ప్రమాణం చేస్తారా? లేక బాబాయ్ పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా? అని నిలదీశారు. దీనిపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. కాగా.. ఇవాళ తిరుమలకు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్‌ సవాల్‌ విసిరారు. అయితే.. దీనిపై వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news