జల్లయ్య‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్

-

హత్యకు గురైన టీడీపీ బీసీ నాయకుడు జల్లయ్య‌ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు నారా లోకేష్. సీఎం జగన్ చేస్తోంది సామాజిక అన్యాయమని…ఒకపక్క సామాజిక న్యాయ భేరి అంటూ బస్సు యాత్రలు చేస్తూ మరోపక్క బీసీ నాయకుల్ని పక్కా ప్రణాళికతో హత్యలు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు.

బీసీలు తనవైపు లేరనే కక్షతోనే తన సామాజిక వర్గం నేతల్ని బీసీ నాయకుల్ని మట్టుపెట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేసారని…సీఎం జ‌గ‌న్‌ బినామీ పిన్నెల్లి నియోజ‌క‌వ‌ర్గం మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్యచేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా బీసీ నేతల హత్యల వెనుక పెద్ద కుట్ర ఉంది…బీసీ నేత జల్లయ్య కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు నారా లోకేష్.

రాజారెడ్డి రాజ్యాంగంలో హత్యలు చేసి హ్యాపీగా తిరగొచ్చు అనే భావనలో ఉన్నారని వెల్లడించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వం.. ఖచ్చితంగా చేసిన ప్రతి నేరానికి వైసీపీ నాయకులు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. నివాళులర్పించడానికి కూడా వీల్లేదని అరెస్టులు చేయడం ఏపీలో పోలీసు శాఖ దుస్థితిని తెలియజేస్తోందని పేర్కొన్నారు. జల్లయ్యని హత్య చేసిన వారికి శిక్ష పడేవరకు న్యాయ‌ప‌రంగా పోరాడతామని పిలుపు ఇచ్చారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news