వైరల్ : పచ్చిమిర్చి రూపంలో వినాయకుడు.. నిజంగానే అద్భుతం..!

-

వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. తాజాగా కూరగాయలు తీసుకోని ఇంటికి వెళ్లిన ఓ మహిళకు ఓ పచ్చిమిర్చి వినాయకుడి రూపంలో కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె ఆ విఘ్నేశ్వరుడే తమ ఇంటికి వచ్చాడని మురిసిపోయింది. ‘మనం స్వామి దగ్గరకు వెళ్లలేకపోతే, స్వామే మన దగ్గరకు వస్తారు. ఒక్కోసారి మిర్చి రూపంలో కూడా”అని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.

ఆ మిర్చి చూడ్డానికి వినాయకుడి తల, తొండంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాగా ప్రతీ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే చవితి వేడుకలు ఈ సారి కరోనా కారణంగా అంతంత మంత్రంగానే జరుగుతున్నాయి. ప్రతీ సంవత్సరం గల్లీ గల్లీ లో కొలువుదీరే గణనాధుడు ఈ సారి కొన్ని చోట్లకి మాత్రమే పరిమితం కానున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news